బరువు తగ్గాలన్న, షుగర్ తగ్గలన్నా అన్నం కి బదులు పుల్కాలు తినాలని చెప్తుంటాము. అన్నం లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.పుల్కాలు కొంత మంది గోధుమ పిండితో చేస్తారు. కొంత మంది మల్టి గ్రైన్ పిండితో చేస్తారు.గోధుమ పిండి వేడి అనుకొనే వారు జొన్న రొట్టెలు రాగి రొట్టె లు తిన్నా మంచిదే.
షుగర్ , బరువు తగ్గడానికి పుల్కలకి బదులు మల్టీ గ్రైన్ పిండి తో అట్లు చేసుకోవడం మంచిది. ఈ పిండిలో కొంచెం మజ్జిగ ,నీళ్ళు కలిపి పలుచగా చేసి అట్లు పోసుకుంటే తినడా నికి సులభంగా ఉంటుంది. రాగి పిండి , తో జొన్న పిండి తో కూడా అట్లు చేసుకోవడం మంచిది. తినడానికి మెత్త గా ఉంటుంది.
ఈ అట్లు పోసేటప్పుడు 30గ్రామం ల పిండి తీసుకొని దాంట్లో పుల్లపెరుగు కొంచెం పాలకూర లేదా మునగాకు లేదా మెంతికూర కట్ చేసి పిండి తో కలపడం వల్ల పోషకాలు సరిగ్గా అందుతాయి. అట్ల తో కూర ఎక్కువగా తీసుకోవడం మంచిది.
రెండు అట్లతో అర కేజీ కూర తినాలి. పళ్ళు లేనివారికి ఈ అట్లు బాగా ఉపయోగపడుతాయి. షుగర్. బరువు తగ్గుథాయ్. షుగర్,బరువు వున్నవారైనా భవిషత్తు లో రావద్దు అని అనుకొనేవారు ఇలా తినవచ్చు.