ఈ రోజుల్లో కీళ్ల,కాళ్ళ నొప్పులు రావడం అందరికీ సర్వసాధారణం ఐయిపోయాయి. దాదాపు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఈ సమస్య కనిపిస్తూనే ఉంది. అయితే ఈ సమస్య మన శరీరంలో క్యాల్షియం లోపం రావడం వల్ల మన కీలు జాయింట్లు బలహీనపడి అప్పుడు మనకి నొప్పి మొదలు అవుతుంది. అయితే ఆ బలహీనపడిన కీళ్ల జాయింట్ ల నుండి శబ్దాలు వస్తూ ఉంటే క్రమం తప్పకుండా మూడు రోజులు దీనిని తాగండి. మీ శరీరంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో క్యాల్షియం లోపం కేవలం వృద్దులలో మాత్రమే కాదు, చిన్న పిల్లలలో కూడా ఎక్కువ గా కనిపిస్తుంది. మీ ఒంట్లో నీరసం, పని చేస్తే అలసట గా అనిపించిందా అంతే మీలో కాల్షియం లోపం ఏర్పడింది అని తెలుసుకోవాలి.(nswhealth)
దీనిని ఎక్కువ రోజులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, కేవలం ఎముకలు బలహీనపడడం మాత్రమే కాకుండా, మీ కళ్ళు, చర్మం మరియు వెంట్రుకలపై తీవ్ర సమస్యలు వచ్చేలా చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో కేవలం 30 సంవత్సరాలకే ఎక్కువ శాతం ఎముకల బలహీనత వచ్చేస్తుంది. కాల్షియం సమస్య ఎక్కువ శాతం ఇంట్లో ఉండే వారు అంటే సూర్య కిరణాలు అస్సలు ఒంటిపై పడని వారిలో కనపడుతుంది. ఎముకల బలహీనతను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తీసుకోవడం వలన మీ శరీరంలో సరికొత్త ఎనర్జీ పుట్టెల చేస్తుంది.ఈ చిట్కా మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.(nswhealth)
మొదటి రెమెడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
- పాలు
- బాదాం పప్పు (మంచి బాదం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Zzf9vd)
ముందుగా మీరు ముందు రోజు రాత్రి బాదం పప్పులను(రోజు తినడానికి సరిపడా ) నీటిలో నానబెట్టుకోవాలి.మరుసటి రోజుకి ఇవి మెత్తగా కొంచెం ఉబ్బి ఉంటాయి. ఆ తరువాత ఒక గ్లాస్ పాలు తీసుకొని వాటిని వేడి చేస్కోవాలి. ఇక మీ మొదటి రెమెడీ తయారు ఐనట్లే. మీరు బాదం పప్పులను పాలల్లో వేసుకొని వాటిని నములుతూ గ్లాస్ పాలను తాగేయండి. మీరు ఈ రెమెడీ ని ఉదయం సమయంలో పాటించండి. ఇవి మీ శరీరంలో ఎముకల బలహీనతను తగ్గించడంతో పాటు ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం లాంటి పోషక విలువలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.(nswhealth)
రెండవ రెమెడీ తయారు చేస్కోవడానికి కావాల్సిన పదార్థాలు:
- నువ్వులు (మంచి నల్ల నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3QGh650)
- మంచి నీరు
ముందుగా నువ్వులను తీస్కొని వాటిని మిక్సీ వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఒక చెంచా నువ్వులలో 100 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. మీరు ఈ పొడిని ఏదైనా డబ్బాలో కూడా స్టోర్ చేస్కొని పెట్టుకోవచ్చు. మీరు ఈ రెమెడీ ని సాయంత్రం సమయంలో ఒక చెంచా లేదా రెండు చెమ్చాలు నువ్వుల పొడిని తీసుకొని గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా రోజు సాయంత్రం తీసుకోవడం వలన మీ శరీరంలో ఎముకల బలహీనతను తగ్గించడంతో పాటు ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం లాంటి పోషక విలువలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ చిట్కాలు రోజుకు రెండు సార్లు ఉపయోగించాలి. ఒకసారి దీనిని మీరు ఉదయం పూట తీసుకోవాలి, మరియు రెండవసారి సాయంత్రం పూట తీసుకోవాలి. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.(nswhealth)