చాలామందికి మల విసర్జన ప్రతి రోజు ఒకే సమయానికి జరగదు. ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా మూడు రకాల అసౌకర్యాలు కనిపిస్తాయి. మొదటిది – మలం గట్టిగా, లావుగా ఉండి సులభంగా బయటకు రాకపోవడం. కూర్చున్నప్పుడు వచ్చినట్టు అనిపించినా బలంగా ముక్కితేనే కిందికి జరగడం. రెండవది – విసర్జన సమయంలో నొప్పి, తర్వాత కొంతసేపు మంట లేదా తీపి భావం ఉండటం. మూడవది – మలంతో పాటు రక్తపు చుక్కలు కనిపించడం.
‘బూకీ’ ఈవెంట్లో ఆసక్తికర చర్చ: తొందరపడి పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దన్న మంచు లక్ష్మీ
ఈ సమస్యల ప్రధాన కారణం మలం ఎక్కువసేపు ప్రేగుల్లో నిల్వ ఉండటమే. 30–50 గంటలు నిలిచిన మలం లోపలి వేడి వల్ల ఎండిపోయి గట్టిపడుతుంది. ఆ గట్టి భాగం ముందుగా వస్తూ మలద్వారాన్ని బలంగా విస్తరింపజేస్తుంది. దాంతో నొప్పి కలుగుతుంది. బలంగా ముక్కితే సూక్ష్మ రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరుగుతుంది.
సాంబార్ వడ తింటున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
పరిష్కారంగా రోజుకు ఒకసారి కాకుండా అవసరమైతే ఉదయం రెండోసారి కూడా మల విసర్జనకు ప్రయత్నించడం మంచిది. గోరువెచ్చని నీరు లీటరు వరకు తాగి కొద్దిసేపు శరీరానికి సహజ కదలికలు రావడానికి సమయం ఇవ్వాలి. ముక్కకుండా సహజంగా వచ్చినప్పుడు మాత్రమే విసర్జన చేయాలి. నొప్పి ఉంటే చల్లటి నీటితో కడగడం లేదా ఐస్తో కొద్దిసేపు చల్లదనం ఇవ్వడం ఉపశమనం ఇస్తుంది.
సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.
ఆహారంలో ఫైబర్ పెంచడం చాలా ముఖ్యము. చియా గింజలు, పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్ వంటి ఆహారం మలాన్ని మెత్తగా ఉంచుతుంది. తగినంత నీరు తాగడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం, రోజూ రెండుసార్లు ప్రయత్నించడం ద్వారా ఈ మూడు సమస్యలను తగ్గించుకోవచ్చు.
కంటి చూపును డ్యామేజ్ అవ్వకుండా కాపాడే డ్రింక్ ఇది.