ఫేస్బుక్ పరిచయం .. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండగా..

ఫేస్బుక్ పరిచయం .. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండగా..

ప్రస్తుత కాలంలో వివాహం కానీ యువతీ యువకులే కాదు,వివాహం అయిన వారు కూడా ప్రేమ పేరుతో రకరకాల సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. ప్రేమ పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారి కుటుంబాలను రోడ్డునపడేసుకుంటున్నారు. సోషల్ మిడియా వాడకం పెరిగాక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న ఇద్దరు వివాహితులు అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

కొంతకాలంగా వీరి వ్యవహారం గుట్టుగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడితో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లల తల్లి తో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొన్ని విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్న ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అయితే అశోక్ నగర్ లో వీరిద్దరు ఒక రూమ్ లో కలిసి ఉండగా కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కలిసి పట్టుకున్నారు.

ఆ తర్వాత వారిద్దర్ని తాడుతో బోరింగుకు కట్టేశారు. వీరిద్దరిని కట్టివేసిన సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసి నెట్టింటా వైరల్ చేశారు.. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని ప్రియుడు, ప్రియురాలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *