రైతును కోటీశ్వరున్ని చేసిన చెట్టు

రైతును కోటీశ్వరున్ని చేసిన చెట్టు

అదృష్టం చెప్పిరాదు దరిద్రం చెప్పిపోదు అన్నట్టు ఎవలకి ఎప్పుడు ఎట్లా అదృష్టం పడతదో తెలవదు వల్ల రాత్రికి రాత్రే గరీబోళ్ళు ఉన్న శ్రీమంతులు అయిపోతారు ఉన్నోళ్ళు భికారులు అయిపోతుంటారు, ఇలాగే మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబానికి అదృష్టం బట్టి పొలంలో ఉన్న ఒక్క చెట్టు తో కోటీశ్వరులు అయర్రట మరి రైతును కోటీశ్వరుని చేసిన ఆ చెట్టు సంగతి ఏందో అరుసుకొని వద్దామా…. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఉసాద్ తాలూకా కుర్షి అనే ఊర్లో ఉంటాడట గీ రైతు పేరు కేశవ్ షిండే అయితే ఈ రైతు పొలం మీదంగా వార్దా నాందేడ్ సిటీల నడమ కొత్త రైల్వే లైన్ వరుస్తందుకు ప్లాన్ వేసిందట రైల్వే .

ఇక రైల్వే లైన్ రావాలంటే రెండు దిక్కుల భూమి జాగా సేకరించాలి కదా అట్లానే అందరితో పాటు ఈ కేశవ షిండేకు ఉన్న ఏడు ఎకరాల పొలం జాగా తీసుకుంటందుకు కూడా ఒప్పందం అయిపోయింది. ఈ ఈయన పొలంలోనే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకే షిండే పొలంలో ఎక్కువ జాగా తీసుకున్నారట. ఇక తీసుకున్న జాగాల మామిడి చెట్లు, పైప్ లైన్లు అన్నీ ఉన్నాయట.

ఇవ్వన్నీ అట్లనే లెక్క కట్టి జాగ ఎట్లుంది ఎట్లా ప్లాన్ గీయాలని సర్వే కోసం వచ్చిన రైల్వే ఉద్యోగుల ఒక ఆయన ఉండి పొలం నడిమి ఇట్టున్న గీ చెట్టుని చూసి షాక్ అయిండట ఎందుకంటే ఇది అలాంటి ఇలాంటి చెట్టు కాదు మరి ఎర్రచందనం చెట్టు అట అదే మన పుష్ప సినిమాల స్మగ్లింగ్ చేసే రక్త చందనం చెట్టు అన్నట్టు ఎంత లేదన్నా వంద ఏళ్ల మీద వయసు ఉంటదట చెట్టు. ఇక ఆయన డబ్బున రైతుని పిలిచి ఏమయ్యా కేశవ షిండే నీ పొలంలో ఇంత విలువ గల చెట్టు ఉంది కదా నీకు తెలవదా ముచ్చట అని అంటే తెలవదు సారు అని ఆ షిండే ఆయన కొడుకులు కూడా చెప్పిరట.

ఇక తెలిసినాక ఊకుంటారా ఆయంత ఈ ముచ్చట రైల్వే అధికారులకు లెటర్ రాసిరట సారు మీరు మా పొలంలో ఉన్న మామిడి చెట్లకు యాప చెట్లకు పాయబలు కట్టించిరు బాగానే ఉంది కానీ పొలంలోఉన్న ఈర్రచంద్రం చెట్టుకు పైసలు కట్టియాలి కదా అని అయితే రైల్వే అధికారులు రెస్పాండ్ కాలేదట ఇక ఇట్లా కాదని అక్కడ జిల్లా కలెక్టర్ చెప్పిడట ఈ కేసు మా పరిధులకు రాదయ్యా అని కలెక్టర్ సార్ అంటే ఇక ఆడికెళ్లి చక్కగా మహారాష్ట్ర హైకోర్టులో కేస వేస్తే పెద్ద కోటోలు ఉండి ఆ చెట్టు ఇలువెంతో లెక్కేసేదంక రైతు కేస వచ్చిండే కుటుంబాం పేరు మీద కోటి రూపాయలు డిపాజిట్ చేయాలి అలకెళ్లి 50 లక్షల రూపాయలు వాడుకునే పరి పర్మిషన్ కూడా ఇయ్యాలని ఆర్డర్ వేసిరట.

కిస్మత్ అంటే వీళ్ళదేపో ఈ ఎర్ర చందనం చెట్టు విలువ ఎంత లేదన్నా 4 కోట్ల 75 లక్షల రూపాయల దాకా ఉంటదని అంచనా కట్టిరట ఇక ఆ పైసలు కూడా కట్టించిరా అంటే రైతు కుటుంబానికి ఎర్ర చందనం చెట్టు జాక్పాటు కొట్టించినట్టే ఇన్నేళ్ల పాటు కొట్టేయకుండా పొలంలో కాపాడినందుకు రైతు రుణం తీసుకుంటున్నట్టే ఉందిలే ఈ స్టోరీ. మరి అట్లా ఉంటది చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అనేది గిందికే అన్ని ఇంతగనం విలువ ఉంటాయి అని కాదు గానీ ఏమఇచ్చినా ఇయ్యకున్నా మనిషి బతికేతందుకు కావాల్సిన గాలి ఇస్తాయి ఎండకొడితే నీడని ఇస్తాయి కదా ఆ చెట్లు మరి అవి సరిపోవామొత్తానికి ఒక్క ఎర్రచందనం చెట్టు వీళ్ళ జీవితాన్ని మార్చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *