పిల్లలు ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి పెట్టుకుని తింటున్నారు. మట్టి ,బలపాలు ,చాక్ పీస్, పెన్సిల్ ఇవన్నీ పెట్టుకుని తింటుంటారు. ఇలా ఎక్కువ కాలం తినడం వల్ల అది ఒక వ్యసనం లాగా మారిపోతుంది. పిల్లలు ఇవన్నీ ఎందుకు తింటారంటే బాడీలో ఐరన్ లోపిస్తే లేదా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే, జింక్ తక్కువగా ఉంటే ఇవన్నీ తినాలనిపిస్తుంది.
పిల్లలలో ఏ లోపం ఉందో తెలుసుకొని దాన్ని సరి చేస్తే ఇది తినరు. ఐరన్ తక్కువగా ఉంటే పిల్లలకి ఎక్కువగా తోటకూర లేదా క్యాలీఫ్లవర్ కాడలు ఎక్కువగా పెట్టాలి. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తవుడు లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా వృద్ధిచెందాలంటే ఆకుకూరలు ,పప్పులు ఎక్కువగా తినాలి.
జింకలోపం తగ్గాలంటే గుమ్మడి గింజల పప్పు నానబెట్టి తినాలి. అలాగే పిల్లలకి పెద్ద ఉసిరికాయ ముక్కలను కానీ , ఆంచూర్ మొక్కలను కానీ, నోట్లో వేసుకొని చప్పరించమనాలి. బలపాలను, చాక్ పీస్, పెన్సిల్ వీటిని కొద్ది రోజులపాటు కంటికి కనిపించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈ ఆలవాట్లను కొద్దిగా మానుకుంటారు.